Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> >>
35 వేలు ఇస్తాం

35-velu
- ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తేల్చిచెప్పిన డిప్యూటీ సీఎం
- ఇష్టమైతే అంగీకార పత్రాలు ఇవ్వండి
- యాజమాన్యాల్లో భిన్నాభివూపాయాలు
- రూ.35 వేలకు 80 శాతం కళాశాలల అంగీకారం
- రూ.40 వేలు చెల్లించాల్సిందేనని మరికొన్నింటి డిమాండ్
- ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదన మేరకు ఫీజులు: టాప్ 30 కాలేజీల షరతు
- తనిఖీలు నిర్వహించి ఫీజుల నిర్ణయానికి ఓకే: సర్కారు
- సీఎంను కలవాలని యాజమాన్యాల నిర్ణయం
- నేడు ముఖ్యమంవూతితో సబ్ కమిటీ భేటీ
- ఫీజులు, కౌన్సెలింగ్ తేదీలపై నేడు ప్రకటన వెలువడే అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 12 (టీ మీడియా): ఫీజులు పెంచాలన్న ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. తాననుకున్న రీతిలోనే ప్రతిపాదనలను ముందు పెట్టింది. గత ఐదురోజులుగా జరుగుతున్న చర్చలు పూర్తిస్థాయిలో సఫలం కానప్పటికీ పురోగతి సాధించిన చెప్పాలి. రెండు రకాల ఫీజులు నిర్ణయించి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు సమర్పించని కాలేజీలన్నింటికీ రూ. 35 వేలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తేల్చిచెప్పారు. ఇది రెండేళ్లకు వర్తిస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు రెండురోజుల్లో అంగీకార పత్రాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనపై కాలేజీ యాజమాన్యాల్లో భిన్నాభివూపాయాలు వ్యక్తమౌతున్నాయి.

తాము డిమాండ్ చేస్తున్న రూ. 40 వేల ఫీజు చెల్లించాల్సిందేనని కొన్ని కాలేజీలు పట్టుబడుతున్నాయి. అయితే ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు ఇవ్వని మెజార్టీ కాలేజీలు మాత్రం రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూనే డిప్యూటీ సీఎం ప్రతిపాదనకు అంగీకరించాయి. రూ. 35 వేల ఫీజు రెండేళ్ళకు వర్తిస్తుందన్న ప్రభుత్వ వాదనకు ఇంజినీరింగ్ కాలేజీలు అంగీకరించటం లేదు. ప్రభుత్వం రెండేళ్ళకు ఇదే ఫీజు వర్తిస్తుందని చెప్పినప్పటికీ తాము ఈ ఏడాదికి మాత్రమే రూ. 35 వేల ఫీజు అంగీకరించినట్లు కన్సార్షియం ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర్‌డ్డి మీడియాకు తెలిపారు. అయితే ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు ఇచ్చిన సుమారు టాప్ 30 కాలేజీలు మాత్రం ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదనల మేరకు ఏకీకృత ఫీజు నిర్ణయిస్తూ ఫీజులు ఏ మేరకు పెరిగితే ఆ ఫీజులు చెల్లించాలని తేల్చిచెప్పాయి.

దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం తనిఖీలు నిర్వహించి ఫీజులు చెల్లిస్తామని మంత్రులు దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, బీ సారయ్య చెప్పటంతో కాలేజీలు ఇందుకు అంగీకరించాయి. అయితే ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు ఇచ్చిన మిగతా కాలేజీలు మాత్రం తనిఖీలు లేకుండా రూ.40 వేల ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

సోమవారం ముఖ్యమంవూతిని కలిసి ఫీజుల పెంపు అంశాన్ని చర్చించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఫీజుల పెంపు అంశం కొలిక్కి రానప్పటికీ సోమవారం ముఖ్యమంవూతితో సబ్ కమిటీ భేటీ తర్వాత ఫీజుల చెల్లింపు అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో యాజమాన్యాలతో చర్చల అనంతరం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలిపారు.

ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిన అంశాలు: రూ. 35 వేలు ఫీజు నిర్ణయం రెండేళ్ళకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రతిపాదించగా, 2012-13 సంవత్సరానికే ఈ ఫీజుకు అంగీకరించినట్లు కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. రెండేళ్ళకు అంగీకరిస్తే నాలుగేళ్ళపాటు ఇదే ఫీజు తీసుకోవాల్సి ఉంటుందని వాటి వాదన. మంత్రి పితాని సత్యనారాయణ ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండానే మీడియాతో భేటీని ముగించేశారు. ఏఎఫ్‌ఆర్సీ ప్రతి మూడేళ్ళకోసారి ఫీజులు నిర్ణయిస్తుంది. రెండేళ్ళ క్రితం నిర్ణయించిన ఫీజు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. వచ్చే ఏడాది కూడా ఇదే ఫీజుకు అంగీకరిస్తే ప్రస్తుత ఏడాది నుంచి నాలుగేళ్ళపాటు ఇదే ఫీజు తీసుకోవాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు అభివూపాయపడుతున్నాయి. రూ. 35 వేల ఫీజుకు అంగీకరించామని మెజార్టీ కాలేజీ యాజమాన్యాలు అంటుండగా మరికొన్ని కాలేజీలు రూ. 40 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం రూ. 35 వేలు కాకుండా ఇంకాస్త పెంచి ఇస్తుందా అనే అంశం తేలాల్సి ఉంది. రూ. 35 వేలు ఫీజు అంగీకరించకుండా ఉన్న కాలేజీల్లో ఏకీకృత ఫీజు రూ. 50,200 నిర్ధారించాల్సి ఉంటుంది.ఈ ఫీజుపై 150 శాతం వరకు పెంచాల్సి ఉంటుంది. తనిఖీలు నిర్వహించి ఫీజులు ఇవ్వాలని సుమారు 30 కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. రూ.35 వేలు ఫీజు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది. మిగతా పెరిగే ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందా? విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుందా?.. అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది.

చర్చలు సఫలం: మంత్రి పితాని
ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలం అయినట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రూ.35 వేల ఫీజు చెల్లిస్తామనే ప్రతిపాదనకు కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయని ఆయన చెప్పారు. ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ తేదీల షె డ్యూల్‌ను సోమవారం వెల్లడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం ముఖ్యమంవూతితో సబ్ కమిటీ భేటీ కానున్నట్లు వివరించారు. ఫీజుల పెంపు అంశాన్ని ముఖ్యమంవూతికి వివరించి సబ్ కమిటీ నిర్ణయం ఆమోదం పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఫీజులపై కోర్టుకు వెళతాం: ఎన్ రమేష్
రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సఫలం కాలేదని ఏపీ కన్సార్షియం ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ ఎన్ రమేష్ అన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు రూ.40 వేలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అంగీకరించటం లేదన్నారు. ఫీజుల అంశాన్ని కోర్టులో తేల్చుకోనున్నట్లు తెలిపారు. 35 వేల ఫీజు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని, కానీ మరోసారి సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంఘాల తరపున ఫీజులు అంగీకరించలేదు: నోవా కృష్ణారావు, ప్రదీప్
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన రూ. 35 వేల ఫీజు చెల్లింపుపై కాలేజీ యాజమాన్యాలు ఇంజినీరింగ్ కాలేజీ సంఘాల తరుపున కాకుండా ఎవరికివారుగా ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించినట్లు ఇంజినీరింగ్ కాలేజీ యజమానులు నోవా కృష్ణారావు, ప్రదీప్, కృష్ణారావు తెలిపారు. కౌన్సెలింగ్ ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించినట్లు వారు వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళం దృష్ట్యా ఇప్పటికే 30 శాతం మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine