హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జగన్, మోపిదేవి వెంకటరమణలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. పోలింగ్ రోజున ప్రత్యేక భద్రత మధ్య పోలింగ్ కేంద్రానికి తరలించాలని డీజీపీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు గత కొంత కాలంగా చంచల్గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.