Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home >> Edit Page >>Articles



ఈ నేలమీది గొప్ప సాంస్కృతిక పోరాటం

ప్రముఖ చిలీ రచయిత ఏరియల్ డార్ఫ్‌మెన్ రాసిన ‘విడోస్’ నవలలో వెంటాడే మాటలు. 1942లో నాజీ దురాక్షికమణలో ఉన్న గ్రీసులోని ఒక గ్రామం నవలాస్థలం. ఆ గ్రామంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది తన ప్రవాహంతో తరచుగా మనుషుల శవాల్ని ఊళ్లోకి మోసుకొస్తుంది. గుర్తు పట్టడానికి ఆనవాలు చిక్కని ముఖాల తో ఉంటాయి ఆ నిర్జీవ దేహాలు. ‘గుర్తు తెలియని శవం’ ముద్ర పడే సి పోలీసులు వాటిని వదిలించుకుంటారు. వీరంతా తప్పకుండా ఎవరికో తండ్రులు, భర్తలు, సోదరులు, కొడుకులు అయ్యే ఉంటారు. కుటుంబసభ్యుల మధ్య సాదా సీదా జీవితం గడుపుతుండిన వారు. పొలాల్లో పనిచేస్తున్న వాళ్లు, భార్యాబిడ్డల కౌగిట్లో ఉన్న వాళ్లు హఠాత్తుగా మాయం చేయబడతారు. గుర్తు తెలియని శవంగా నదిలో కొట్టుకువస్తారు. అట్లా మాయమైన భర్తల కోసం, కొడుకుల కోసం ఆ ఊరి ఆడవాళ్లు నది ఒడ్డున ఎదురుచూసే బీభత్స విషాదం ‘విడోస్’. ఆ విషాదం నుంచే ఒకరోజు అలాంటి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ ఊరి ఆడవాళ్లంతా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిస్తారు. పోలీసులు ఇతను ఎవరికి సంబంధించినవాడో గుర్తుపడితే వారికి మాత్ర మే అప్పగిస్తామంటారు. అప్పుడా మహిళలు పై మాటలంటారు. మరణించిన వారికి గౌరవంగా అంతిమక్షికియలు జరపాల్సిన బాధ్యత బతికున్నవాళ్ల మీద ఉంటుందని వాళ్లు భావిస్తారు. ఇందులో సాంస్కృతి క అంశంతో పాటు ఫాసిజాన్ని ధిక్కరించిన పోరాటం ఉంది. ఇది ఒకరకంగా మన కథే. నక్సలైట్లనో, వారి సానుభూతిపరులనో తెలంగాణలో మాయం చేయబడి బతికి ఉన్నారో లేరో తెలియని వాళ్ల ‘మిస్సిం గ్’ అనుభవాల నుంచే ఈ నవల తెలుగులో ‘మిస్సింగ్’ అనే పేరుతో వచ్చింది.

‘విడోస్’ ఒక గ్రీకు గ్రామాన్ని దృశ్యమానం చేసినా రచయిత చిలీలో అలెండీని చంపి అధికారంలోకి వచ్చిన అమెరికా కీలుబొమ్మ పినోచెట్ సాగించిన మారణకాండను గురించి రాయాలనుకున్నాడు. అప్పటికే ఆయనతో సహా ఆయన రచనలూ నిషేధించబడి ఉన్నాయి. కనుక దీన్ని ఒక యూనివర్సల్ ట్రూత్‌గా చెప్పాలనుకుని స్థలకాలాలను మార్చాడు. ఆయనే చెప్పినట్టు ఇది ఇప్పుడు చిలీ, ఎల్‌సాల్వడార్, ఫిలిప్పీన్స్, దక్షిణావూఫికాల్లో జరుగుతుండవచ్చు. నిన్న ఇంకోచోట జరిగి ఉండవచ్చు. రేపు మరోచోట జరగవచ్చు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో సొఫోక్లస్ రాసిన ‘యాన్‌టిగని’ నాటకంలో తిరుగుబాటుదారుడిగా చనిపోయిన తన సోదరుడి మృతదేహాన్ని పూడ్చకుండా యుద్ధక్షేవూతంలోనే జంతువులకు వదిలేసి శిక్షించిన థీబ్స్ (పురాతన ఈజిప్టు) రాజు శాసనాన్ని ధిక్కరించి అంత్యక్షికియలు నిర్వహించిన యాన్‌టిగనీలు చరిత్ర పొడవునా ఉన్నారు.

అట్లా మన నేల మీద నడుస్తున్న గొప్ప సాంస్కృతిక ఉద్యమం ఎన్‌కౌంటర్ మృతదేహాల స్వాధీన పోరాటంతో మొదలై రాజ్యహింస వ్యతిరేక పోరాటంగా కూడా కొనసాగుతున్న అమరుల బంధుమివూతుల సంఘమైంది. నేడు దశాబ్ది మహాసభలు జరుపుకుంటున్నది. నాయకుల మృతదేహాలను కట్టెలపై నగ్నంగా పడేసి కాల్చుతుండగా అడ్డుకున్న గద్దర్‌తో పాటు వివిధ సంఘాలు వారికి గౌరవంగా అంత్యక్షికియలు జరిగేలా చేశాయి. అప్పటి నుంచి వరుసగా జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి మృతదేహాలు స్వాధీనం చేసుకోవడానికి పోరాటం-ఒక రకంగా నిర్బంధపు నిప్పుల కొలిమిలో తెలంగాణలో అలుముకున్న శ్మశాన నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. వివిధ ప్రజా సంఘాలతో, సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలతో ఎన్‌కౌంటర్ మృతదేహాల స్వాధీన కమిటీ ఏర్పడింది. ‘గుర్తు తెలియని ఎన్‌కౌంటర్ మృతదేహమై తే నాకివ్వండి..’ అంటూ వీవీ అద్భుతమైన కవిత రాశారు. ఈ నేపథ్యంలోనే గద్దర్‌పై 1997లో హత్యా ప్రయత్నం జరిగింది. ఇది నేపథ్యం. సమాజమార్పు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తిని వారి బంధుమివూతులు ఎత్తిపడుతుంటే మరోవైపు మృతదేహాల పట్ల కూడా అత్యంత అమానవీయంగా ప్రవర్తించి రాజ్యం ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొంటోంది.

మృతుల ఆచార వ్యవహారాలకు భిన్నంగా వారి శరీరాలను కడతేర్చడం కూడా ఫాసిస్టు పాలకుల అణచివేత రూపాల్లో ఒకటి. జోన్ ఆఫ్ ఆర్క్ వలె ప్రొటెస్టెంట్లను నిట్టనిలువునా కాల్చేసి బూడిదను వెదజల్లిన అప్పటి మతపెద్దల దగ్గరి నుంచి నిన్న లాడెన్ శవాన్ని సమువూదంలో పడేసిన సామ్రాజ్యవాదుల దాకా పాలకపక్షాలకు ఇదొక అణచివేత నీతి. దీన్ని ధిక్కరించడానికి ప్రజలు అనేక రూపాల్లో సమీకృతులయ్యారు. వివిధ విముక్తి ఉద్యమాల్లో నిర్దాక్షిణ్యంగా హత్యగావించబడుతున్న (ఈ హత్యలకు ఎటువంటి జవాబుదారీతనం ఉండదు) విప్లవకారుల భార్యలు, తల్లులు, రక్త బంధువులు శ్రీలంక, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వంటి అనేకచోట్ల కమిటీలుగా ఏర్పడుతున్నారు. 2002లో ఆవిర్భవించిన అమరుల బంధుమివూతుల సంఘం, బాధితుల సంఘంగా కాక కన్నీళ్లను తుడుచుకుంటూనే అమరుల ఆశయసాధన కోసం పిడికిపూత్తి నిలబడిన పోరాట సంఘంగా నిలిచింది. దానికదే ఒక ప్రత్యేకత. తెలుగు నేల మీది విప్లవోద్యమ వారసత్వపు ప్రత్యేకత. నేడు 10వ మహాసభలు జరుపుకుంటున్న అమరుల బంధుమివూతుల సంఘానికి ‘విరసం’ సంఘీభావం తెలియజేస్తున్నది.

-పి. వరలక్ష్మి, విరసం కార్యదర్శి

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine