Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Edit Page >>Articles



పరకాల గెలుపు పోరాటానికి పిలుపు

పరకాల ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించినప్పుడు నాకు 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ ఎమ్జన్సీ విధించిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, నిరంకుశత్వంతో దేశాన్ని చీకటి రాజ్యంగా మార్చింది. పత్రికా స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించింది. పోలీసు వ్యవస్థను, మిలటరీని ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకొని ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారందరిని చిత్రహింసలకు గురిచేసి, జైళ్లపాలు చేసిం ది. ఇందిరాగాంధీయే ఇండియా, ఇండియాయే ఇందిరాగాంధీగా మార్చింది. అప్పుడు లోక్‌నాయక్ జయవూపకాశ్ నారాయణ్ తన ఆరోగ్యం సహకరించకున్నా సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చాడు. ఆ పిలుపునకు భారతజాతి ఏకమై వీధుల్లోకి వచ్చింది. అసంఘటితంగా ఉన్న భారతజాతి ని ఏకం చేసి నిరంకుశ కాంగ్రెస్ పార్టీని గద్దెదించిన నాడే భారతజాతికి విముక్తి కలుగుతుందని నిర్ణయించుకొని జయవూపకాశ్ నారాయణ్ విభిన్న దృక్పథాలతో, సిద్ధాంతాలతో అసంఘటితంగా ఉన్న భారత రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏకం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు కార్యాచరణ రూపొందించడానికి, నానాజీ దేశ్‌ముఖ్, సురేంద్ర మోహన్, జ్యోతిబసు లాంటి నాయకుల సహాయ సహకారాలు తీసుకొని, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు వామపక్షాల నుంచి విప్లవ సంఘాల వరకు ఏకం చేశారు. అన్నిరాజకీయ పక్షాలతో ఉమ్మడి వేదిక ఏర్పా టు చేసి జయవూపకాశ్ నారాయణ్ ఇచ్చిన పిలుపు పరకాల ఉప ఎన్నిక ఫలితాలను నెమరు వేసుకున్నప్పుడు గుర్తుకు వస్తుంది.


భిన్నమైన సిద్ధాంతాలతో రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నికల్లో సత్తా నిరూపించుకుంటున్న భారతీయ జనసంఘ్ పార్టీ, సోషలిస్టుపార్టీ, కమ్యూనిస్ట్‌పార్టీ, రెవల్యూషనరీ పార్టీలు, నిరంకుశ ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ను కాలదన్ని బయటకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకులు మొరార్జీదేశాయి. జగ్జీవన్‌రాం, చంద్రశేఖర్, మోహన్‌దారియా, ఎస్.జైపాల్‌డ్డి లాంటి ఎందరో రాజకీయనాయకులు ఏకమై అప్రజాస్వామిక కాంగ్రెస్ పార్టీని ఓడించి కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య ఫలితాల ను భారతజాతి అనుభవిస్తున్నది కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించడం లేదని పరకాల ఎన్నికలు నిరూపించాయి.

శ్రీకృష్ణ కమిటీ రహస్య సూచన మేరకు అప్రజాస్వామిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలను, ప్రసార సాధనాలను ప్రలోభాలకు గురిచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నవి. అప్రకటిత ఎమ్జన్సీని తెలంగాణ ప్రాంతంలో అమలు చేస్తున్నది. అందుకు కాంగ్రెస్‌పార్టీ అధికార బలంతో తెలంగాణ నాయకులను పావులుగా వాడుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రం రాదని నిరాశ నిస్పృహలతో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలను అపహాస్యం చేసేవిధంగా వలసవాద పత్రికలలో రాయించి తప్పుడు సంకేతాలిచ్చే కార్యక్షికమం ప్రభుత్వ కన్నుసన్నల్లోనే జరుగుతుంది. నీతి నిజాయితీ, చిత్తశుద్ధి, ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర ఏర్పాటు కోసం చైతన్యం నింపుతున్న చెరుకు సుధాకర్, ఆకుల భూమయ్య, కాశీం లాంటి అనేక మందిని దేశవూదోహులుగా చిత్రించి, హింసించి, జైళ్లల్లో పెడుతున్నది. ఉద్య మంలో పాల్గొంటున్న వేలాదిమంది విద్యార్థులు, యువకులపై కేసులు అనేకం పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతులను అమలు చేస్తున్నది.

గులాంనబీ ఆజాద్, వాయలార్ రవి వంటి సీనియర్ నేతల విశ్లేషణతో పరకాలలో కాంగ్రెస్‌పార్టీ గెలవదని నిర్ధారణకు వచ్చింది. కుట్రలు, కుతంవూతాలతో రాజకీయాలు నడిపే కాంగ్రెస్‌పార్టీ నాయకులు అందుకుగానూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కొండా సురేఖ సోనియాగాంధీ అభిమానిగా నిర్ధారించింది. తెలంగాణ జేఏసీ అభ్యర్థన మేరకు తెలంగాణ కోసం రాజీనా మా చేసిన వ్యక్తిగా, పైగా జగన్ కన్నుసన్నల్లో ఉన్న ఆమెను వైఎస్సార్ పార్టీ తరుపున అభ్యర్థిగా నిలిపి తెలంగాణ,జగన్ సానుభూతి ఓట్లతో టీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీకి డిపాజిట్ రాకుండా కేంద్ర కాంగ్రెస్ పథకం సిద్ధం చేసి, అమలు చేయడానికి అనుమతి పొందింది. అందుకు ప్రతిఫలంగా టీడీపీ నుంచి రాజీనామా చేయని సమ్మారావును కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మ స్వరాజ్ మాటల వలన కాంగ్రెస్‌పార్టీ, తెలంగాణలో నామరూపాలు లేకుండాపోతుందని నిర్ధారించుకుని దానికి డిపాజిట్ రాకుండా చేయడానికి పథకాన్ని రచించింది. బీజేపీ కుల, మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని, జగన్ అవినీతిని సమర్థిస్తూ వైఎస్సార్ పార్టీతో లోపాయకారీ పొత్తు కుదుర్చుకొని సమైక్యవాదాన్ని గెలిపించడానికి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రజలు నమ్మే విధంగా ప్రసార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేసింది. అదేవిధంగా టీడీపీ నాయకుడైన కాంగ్రెస్ అభ్యర్థి సమ్మారావుకు కాంగ్రెస్ నాయకులు ఓటింగ్ నాడు అస్త్ర సన్యాసం చేసి వైఎస్సార్ పార్టీ గెలుపునకు సహకరించారు. ఇన్ని కుట్రలు, పన్నినా టీఆర్‌ఎస్‌యే గెలిచింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్‌పార్టీ కుట్రతో కొంతవరకు వాళ్ళు అనుకున్నది సాధించారు. అందుకే టీఆర్‌ఎస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలను కుతంవూతాలను పసిగట్టలేక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని మెజారిటీ కోల్పోవడం, డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీనిని ఆసరాగా తీసుకుని తెలంగాణ వనరులన్నీ దోచుకుని తెలంగాణ గడ్డ పై అడ్డా వేసిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ వాదానికన్నా సమైక్యవాదానికి మెజారిటీ ఓటర్లు పరకాలలో మద్దతు పలికినారని.. సంబరాలు చేసుకుంటూ తెలంగాణ లేదు, సమైక్యం లేదు కాంగ్రెస్‌పార్టీయే ఉన్నది సీమాం ధ్ర ఉన్నదని పిచ్చికూతలు కూస్తున్నారు. అది సరిదిద్దే గురుతర బాధ్యత తెలంగాణ జేఏసీ, కేసీఆర్‌పై ఉన్నది.

జైపాల్‌డ్డి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న అప్రజాస్వామిక చర్యలను సమర్థిస్తున్నాడు జైపాల్‌డ్డి కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, వనరుల దోపిడీ, ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదంవూడుల రోదన లు గుర్తుకు రావడంలేదు. ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్న నిరంకుశ, అప్రజాస్వామిక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న జైపాల్‌డ్డి మోసగాడని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి రాకముందే తెలంగాణ పోరాటంలో పాల్గొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తెలంగాణ సమాజ విముక్తికి పోరాడి సశ్చీలతను నిరూపించుకోవాలని తెలంగాణ సమాజం కోరుతున్నది.

కుట్రలతో కూడిన రాజకీయాలు నీతిమాలిన లాబీయింగ్‌లు, అసత్యపు ప్రచారంలో అరితేరి న నీతి నిజాయితీలేని ఆంధ్ర నాయకులను ఎదుర్కొవటం సాధ్యంకాదు. ప్రజలు నిరంకుశ అప్రజాస్వామిక కాంగ్రెస్ పార్టీని గద్దెదించి తెలంగాణ సాధించుకునేందుకు సంపూర్ణ విప్లవాన్ని అమ లు చేయాలి. అందుకు కాంగ్రెస్‌లో ఉన్న తెలంగాణ నాయకులందరు కాంగ్రెస్‌పార్టీని వదిలి ఉద్యమంలో పాల్గొనాలి. దీనికి జైపాల్‌డ్డి వంటి నాయకులు ముందుకు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న మధుయాష్కిగౌడ్, కే.కేశవరావు లాంటి కాంగ్రెస్ నాయకులు జగ్జీవన్‌రాం మొరార్జీదేశాయి, చంద్రశేఖర్, లాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని లోకనాయక్ జయవూపకాశ్‌నారాయణ సిద్ధాంతాలను అమలుపరిచే దిశగా తెలంగాణలోని అన్ని పార్టీలను తెలంగాణ అస్తిత్వపార్టీలుగా రూపుదిద్దుకొనేటట్టు చేసి, చిత్తశుద్ధితో సంపూర్ణ విప్లవం తెచ్చి అప్రజాస్వామిక కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకోవాలి. రాజకీయాలకు అతీతంగా సంపూర్ణ విప్లవానికి నాంది పలకాలి.

-మేచినేని కిషన్‌రావు
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు

Other Articles
Namaste Telangana Specials Stories
namaste Videos


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine