Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  Crime News
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం

తాండూరుటౌన్, ఆగస్టు12(టీ మీడియా): వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బంట్వారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాల్ ఆదివారం ఉదయం కుటుంబ విషయమై భార్యతో గొడవ పడ్డాడు. మనస్థాపానికిలోనై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పవూతికి తరలించారు. ప్రస్తుతం గోపాల్ చికిత్స పొందుతున్నాడు.

మరో సంఘటనలో...
బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామానికి చెందిన వెంకటప్ప కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆదివారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పవూతికి తరలించారు. ప్రస్తుతం వెంకటప్ప చికిత్స పొందుతున్నాడు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd