Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Ranga Reddy>>  Crime News
రెండు స్కూల్ బస్సులు ఢీ

కీసర, జూన్ 23 (టీ మీడియా): బ్రిలియంట్, సెయింట్ బేథాని స్కూల్ బస్సులు ఎదుదురుగా ఢీకొన్న సంఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని ఈసీఐఎల్‌కు చెందిన బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ బస్సు శనివారం ఉదయం విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లడానికి కీసరకు వచ్చింది. ఆ బస్సు కీసర, చీర్యాల్, యాద్గార్‌పల్లి, అహ్మద్‌గూడ, గోధుమకుంట తదితర గ్రామాల నుంచి విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని పాఠశాలకు బయలుదేరింది. గోధుమకుంట రెవెన్యూ పరిధిలోని ప్రజయ్‌సాయి గార్డెన్ గేటు వద్ద అహ్మద్‌గూడ గ్రామం నుంచి నాగారంలోని సెయింట్ బేథాని స్కూల్ బస్సు ఎదురుగా రావడంతో ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి. బ్రిలియంట్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ముందుకు పడిపోగా స్వల్పగాయాలయ్యాయి. బస్సు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదంవూడులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. కీసర ఎస్సైలు వెంక ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన విషయాలను తెలుసుకున్నారు. పోలీసులు బ్రిలియంట్, సెయింట్ బేథాని పాఠశాలలకు చెందిన బస్సులను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

నాణ్యతలేని బస్సుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలకు చెందినవారు క్వాలిటీ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పలువురు విద్యార్థుల తల్లిదంవూడులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు అధిక ఫీజులు గుంజుతూనే నాణ్యతలేని బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, క్వాలిటీ లేని బస్సుల విషయంలో ఆర్టీవో అధికారులు స్పందించి యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేపడతామని విద్యార్థుల తల్లిదంవూడులు హెచ్చరించారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd