|
|
వివాహం చేసుకున్న ప్రేమజంట
బాల్కొండ రూరల్, ఆగస్టు 19 (టీ మీడియా) : మండలంలోని పోచంపాడ్ గ్రామ కోదండ రామాలయంలో ఆదివారం సోన్పేట్ గ్రామానికి చెందిన కుట్ల హరీష్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన కొండాజి శ్రీలతలు ప్రేమ వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. వీరిద్దరూ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో చదువుకుంటున్న వీరిద్దరి తల్లిదంవూడులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఆలయ చైర్మన్లు గంగాడ్డి, రాజేశ్వర్, లక్ష్మీనారాయణ గౌడ్, గోపిగౌడ్, మాజీ ఉప సర్పంచ్ గొర్రె కర్రన్న, ఆలయ అర్చకులు రామవూపభులు వివాహపవూతాన్ని అందజేశారు. Other News
|