|
|
అరకొర వసతుల మధ్య కు.ని ఆపరేషన్లు
శివాజీనగర్, జూలై 12(టీ మీడియా): ప్రభుత్వ పథకాలు అధికారులు నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్నాయి. జనాభా నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన కుటుంబ నియంవూతణ ఆపరేషన్లు అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. గురువారం వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా శస్త్ర చికిత్స చేయించుకోవడానికి జిల్లా ఆసుపత్రికి వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోత్సాహకాల మాట దేవుడెరుగు సౌకర్యాలు లేకపోవటంతో అవస్థలు పడ్డారు. వంద పడకల ఆస్పత్రి ఉన్నప్పటికీ ఆపరేషన్ చేసుకున్న మహిళలను వరండాలో పడుకోబెట్టారు. జిల్లాలో కుటుంబ నియంవూతణ ఆపరేషన్ ప్రవేశపెట్టినప్పటిన నాటి నుంచి జిల్లాకు ప్రథమస్థానం వచ్చిన ఘనత ఉంది. కాగా ఆపరేషన్లు చేపడుతున్న తీరు విమర్శలకు దారి తీ స్తోంది. మహిళలకు మత్తుమందు ఇచ్చిన కొద్ది సేపటికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుం ది. ఉదయం ఆస్పవూతికి వచ్చిన మహిళలు అన్ని పరీక్షలు చేసుకొని పరికడుపుతో సిద్ధంగా ఉన్నప్పటికీ సం బంధిత వైద్యులు, సిబ్బంది ఆలస్యంగా రావటంతో మ హిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరైతే సొమ్మసిల్లి పడిపోయారు. Other News
|