Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న బదిలీ

బోధన్, జూలై 11 (టీ మీడి యా) : బోధ న్ మున్సిపల్ కమిషనర్ టి బదిలీ అయ్యా రు. ఆదిలాబా ద్ జిల్లా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌గా ఆయన బదిలీపై వెళ్తున్నారు. ఈ మేరకు ము న్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకన్న బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా 2007 జూన్ 1న బాధ్యత లు చేపట్టారు. 2007 గ్రూప్ -1 సర్వీసెస్‌కు ఎంపికై తొలి పోస్టింగ్‌లో బోధన్ మున్సిపల్ క మిషనర్‌గా వచ్చారు. ఐదు సంవత్సరాలుగా బోధ న్ మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగారు. ఇటీవల కాలంలో ఇంత దీర్ఘకాలం పాటు ఒకే స్థా నంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ రా ష్ట్రంలోనే వెంకన్న కావటం గమనార్హం. సమర్థుడయిన అధికారిగా, నిజాయితీ కలిగిన క మిషనర్‌గా వెంకన్న పేరు తెచ్చుకున్నారు. వి వాదాలకు దూరంగా ఉంటూ బోధన్ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూ పుతూ పలువురి ప్రశంసలు అందుకున్నారు. బదిలీ అయిన వెంకన్న ఒకటి, రెండు రోజు ల్లో రిలీవ్ అయ్యే అవకాశం ఉంది.

కొత్త కమిషనర్‌గా ప్రసాద్..
బోధన్ మున్సిపాలిటి కొత్త కమిషనర్‌గా సి.హెచ్.వి.వి.ఎన్‌పసాద్ నియమితులయ్యారు. ఈ ఏడాది గ్రూప్ -1లో ఆయన ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్‌లోనే బోధన్ మున్సిపాలిటికి కమిషనర్‌గా వస్తున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd