Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
ధర్పల్లి వైన్స్‌కు రూ.కోటి గుడ్‌విల్!

(టీ మీడియా ప్రతినిధి, నిజామాబాద్) : మద్యం దుకాణాల కేటాయింపు వ్యవహారంలో మరోసారి ధర్పల్లి రికార్డు నెలకొల్పనుంది. నిరుడు 2.30 కోట్ల అత్యధిక రెంటల్‌తో ధర్పల్లి మద్యం దుకాణాన్ని చేజిక్కించుకోవడం సంచలనం రేకెత్తించింది. ఈసారి జిల్లాలో ఏ మద్యం షాపునకు రాని స్థాయిలో అత్యధికంగా 131 టెండర్లు దాఖలైన సంగతి తెల్సిందే. బాల్కొండ మండ లం మెండోరాకు చెందిన రాజేశ్వర్‌కు లక్కీ డిప్ ద్వారా సొంతమైన ధర్పల్లి వైన్‌షాప్ మరోసారి రికార్డు సృష్టించబోతోంది. కోటి రూపాయల గుడ్‌విల్‌ను చెల్లించి ధర్పల్లి వైన్స్‌ను సొంతంచేసుకునేందుకు కొందరు మద్యం వ్యాపారులు రెండ్రోజులుగా పోటీపడడం మద్యం వ్యాపారవర్గాల్లో ఆశక్తికరంగా మారింది. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఉన్న వైన్సుల్లో జరిగే విక్రయాలకు ఏమాత్రం తీసిపోకుండా ధర్పల్లి వైన్స్‌లో ప్రతిరోజూ కనీసం రూ.లక్ష, ఆపైచిలుకు అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ లెక్కన ప్రతినెలా రూ30 నుంచి 45 లక్షల మద్యం అమ్మకా లు సాగే ధర్పల్లి మద్యం దుకాణాన్ని సొంతం చేసుకోవడం క్రేజీగా తయారైంది. లక్కీ డ్రాలో అదృష్టం వరించని వ్యాపారులు అత్యధికంగా గుడ్‌విల్ చెల్లించి ఆ దుకాణాన్ని సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. పూర్తిగా గ్రామీ ణ నేపథ్యం కలిగిన ధర్పల్లి మద్యం దుకాణంకో సం కాకలుతీరిన లిక్కర్ వ్యాపారులు పడరానిపాట్లు పడడం గమనార్హం. మండలంలోని 18 గ్రామాల్లోని బెల్ట్‌షాపుల్లో రికార్డుస్థాయిలో మ ద్యం విక్రయాలు జరగడం ఈ పోటీకి ప్రధానకారణమవుతోంది. అన్ని బెల్ట్ షాపులకు ధర్పల్లి వైన్స్ నుంచే మద్యం సరఫరా అవుతుంది.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd