Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Nizamabad>>  General News
బ్లడ్ సేఫ్టీ టెక్నికల్ సూపర్‌వైజర్ తొలగింపు

శివాజీనగర్, జూన్ 13(టీ మీడియా): రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్‌ఏసీఎస్ ఎన్‌ఏసీవోలు పని చేస్తున్న 23 బ్లడ్ సేఫ్టీ టెక్నికల్ సూపర్‌వైజర్‌లను తొలగిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ నో టీస్ జారీ చేశారు. జిల్లాలో రక్తనిధి కేంద్రంలో రక్తం కొ రత ఏర్పడుతుందని దృష్టిలో ఉంచుకొని 17 ఆగస్టు 2009 సంవత్సరంలో టెక్నికల్ సూపర్‌వైజర్‌లను ని యమించారు. జిల్లా రక్తనిధి కేంద్రంలో రక్తం కొరత తో ప్రజలు అవస్థలు పడుతుంటే, ఆయనకు వేతనాలు ఇవ్వడానికి ఎన్‌ఏసీవో వద్ద బడ్జెట్ లేదని తొలగి స్తున్న ట్లు నోటీస్ పంపారు. జిల్లాకు ఉన్న ఒక టెక్నికల్ సూప ర్‌వైజర్‌ను తొలగిస్తే జిల్లా రక్తనిధి కేంద్రంలో కాంపొ నెంట్స్ సెంటర్ ప్రారంభం అవుతుందో లేదో ప్రజల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రక్తహీనత ఉన్న వారి కి, గర్భిణులకు, ప్రమాదక్షతగాత్రులకు, డెంగ్యూ, మలే రియా రోగులకు ప్లేట్లెట్, ప్లాస్మా స్టోరేజ్ చేసి అందా ల్సిన టెక్నికల్ సూపర్‌వైజర్‌ను తొలగించడంతో ఇబ్బం దులు రెట్టింపవుతాయని రోగులు అంటున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd