|
|
కోట నోట తెలంగాణ మాట
నిజామాబాద్ కల్చరల్, జూన్ 9 (టీ న్యూస్) : తెలంగాణ మాండలికంలో రమ్యత, ప్రేమ, అప్యాయత అనురాగాలు ఉన్నాయని తాను ఇంతటి వాడిని కావటానికి తెలంగాణ యాసే కారణమని ప్రముఖ చలనచిత్ర నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. శనివారం రాత్రి శ్రీపాద కళా పరిషత్ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మూడోరోజు నాటక పోటీలకు ముఖ్య కోట శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థలం తల్లిపాల లాంటిదన్నారు. తాను రంగస్థలం నుంచి సినిమా రంగంలోకి వచ్చానని తెలిపారు. అందుకే సినిమా రంగంలో రాణించగలుగుతున్నానని చెప్పారు. తాను ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగవూపవేశం చేసినప్పటికి ‘ప్రతిఘటన’లో తెలంగాణ మాండలికం ద్వారా ప్రజల ఆదరాభిమా నాలతో ఇంతవాడినయ్యానన్నారు. ఈ మాండలికంలో పద ప్రయోగాలు బాగుంటాయని అన్నారు. ఏ పాత్ర ఇచ్చినా పండించగలిగిన వాళ్లే అసలైన నటులు అన్నారు. దేశ బాషలందు తెలుగు లెస్స అన్నదానికి ఇప్పుడు అన్ని లెస్సు అని చమత్కరించారు. ‘ప్రతిఘటన’ సినిమాలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావును శ్రీ పాద కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రముఖ టి.వి, సినిమా రంగస్థల నటులు సుబ్బారాయ శర్మ మాట్లాడుతూ నటుడు మహారాజు, ముష్టివాడి వేశం ఇలా ఏ పాత్రను వేసైనా ప్రేక్షకులను మెప్పించాలన్నారు. అలాంటి నటుడు కోట శ్రీనివాస రావు అని కొనియాడారు. Other News
|