|
|
పిచ్చి కుక్క కరిచి ముగ్గురికి తీవ్ర గాయాలు
తూప్రాన్, ఆగస్టు 19(టీమీడియా): తూప్రాన్లోని మెయిన్ రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులను పిచ్చి కుక్క కాటేసిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మంజు బేకరీ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న మందాల కృష్ణ, సత్యనారాయణగౌడ్, కిష్టయ్య అనే ముగ్గురు వ్యక్తులను పిచ్చి కుక్క కాటువేయడం తో తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు ప్రైవేట్ ఆసుపత్రు లకు వెళ్లి చికిత్స చేయించు కున్నారు. గత 20 రోజుల క్రితం గ్రామంలో సుమా రు 15మంది పిచ్చికుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. పిచ్చి కుక్కల బెడదతో తూప్రాన్లో భయాందోళన చెందుతున్నారు. Other News
|