Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Khammam >>  General News
ఎరువుల దుకాణాలకు అమ్మకాల నిలిపివేత

శుక్రవారం అధికారులు నిర్వహించిన ఆకస్మిక తేడాలున్నట్లు గుర్తించి తదుపరి చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దాడుల్లో నిల్వచేసిన 390 గుర్తించినట్లు, వీటి విలువ రూ. 29.36 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 6(ఎ) నమోదు చేసి ఎరువు నిల్వలు స్వాధీనం చేసుకున్నట్లు, కొన్ని షాపులకు అమ్మకాలు నిలిపి వేయాలని నోటీసులు కూడా జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నేలకొండపల్లి మండలం శ్రీనివాస ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు శ్రీధర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, సాయి ఆగ్రో ఏజెన్సీస్, అరవింద ఆగ్రో ఏజెన్సీస్, అరవింద్ ఆగ్రో ఏజెన్సీస్, శైలజ పెస్టిసైడ్స్, ఖమ్మం అర్బన్‌లోని శ్రీనివాస ఎంటర్ ప్రైజెస్, వైరా మండలం నాగార్జున ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ (గొల్లపూడి), కూనవరం మండలం శ్రీనివాస ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులను సీజ్ చేసి 6(ఎ) కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఎర్రుపాలెం మండలం వేంక ఎంటర్ ప్రెజెస్‌వారు జరిపే అమ్మకాలను నిలుపుదల చేయాలని నోటిసులు జారీ చేసినట్లు, వైరా మండలం గొల్లపూడిలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ (గొల్లపూడి) లైసెన్స్ కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మినగరానికి చెందిన శ్రీనివాస ట్రైడర్స్ అమ్మకాలను నిలిపి వేసినట్లు తెలిపారు. పెనుబల్లి మండలం ఆదర్శ ట్రేడర్స్‌లో అక్రమంగా బీటీ కాటన్ విత్తనాలను నిల్వ చేసినందులకు నిల్వలను స్వాదీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd