|
|
ఎస్సీ, ఎస్టీల భూసమస్యలను సత్వరమే పరిష్కరించండి..
కరీంనగర్, జూలై 11 (టీమీడియా) : ఎస్సీ, ఎస్టీల భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆ ర్డీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ‘ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధం.. అంటరానితనం నిర్మూలన’పై జరిగిన జిల్లాస్థాయి విజిపూన్స్అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ నిధుల దుర్వినియోగంపై అదనపు జేసీతో విచారణ జరిపించామనీ, అందులో జిల్లా రెవెన్యూ అధికారి పాత్ర లేదని తేలినట్లు చెప్పారు. ఎస్పీ కార్యాలయం నుంచి నివేదిక, బిల్లులు తయారీలో ఆలస్యం వల్లే చెక్కుల పంపిణీలో జాప్యం జరిగిందని వివరించారు. ఆలస్యానికి కారకులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. అస్నాపూర్ భూ నిర్వాసితుల్లో అర్హులైన వారికి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈ గ్రామం నుంచి దరఖాస్తులు అందాయనీ, వీటిలో 76 మంది అర్హులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 12 మందికి వారం రోజుల్లో, అతి త్వరలో మిగిలిన వారికి పంపిణీ చేస్తామన్నారు. రామడుగు మండలం వన్నారంలో హతమైన అశ్వత్థామ కుటుంబ సభ్యులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లును మంజూరు చేస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేట గ్రా మంలో ఎస్టీలకు ఇచ్చిన భూమిపై వివాదం తలెత్తగా, రెండు జిల్లాల సర్వేయర్లతో సర్వే చేయించామనీ వారం రోజుల్లో హద్దులు నిర్ణయించి అప్పగిస్తామన్నారు. గంగాధర మండలంలో వరదకాలువ నిర్మాణ బ్లాస్టింగ్లతో ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ వెల్లడించారు. Other News
|