Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Hyderabad>>  General News
చేతనైతే ఉద్యమాన్ని నడిపించు..

సిటీబ్యూరో, టీ మీడియా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉద్యమాన్ని ఇంత కాలం సజీవంగా ఉంచిన కేసీఆర్‌ను విమర్శించే హక్కుమోత్కుపల్లి నర్సింహులుకు లేదని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంక సూచించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ను విమర్శించే బదులు మోత్కుపల్లికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నుంచి బయటకు వచ్చి నీవు స్వతంత్య్ర ఉద్యమం నడిపిస్తే మేమంతా నీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పోరాటం చేతకానప్పుడు కేసీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదని గుర్తుంచుకొవాలని మోత్కుపల్లికి హితవు పలికారు. టీడీపీ కనుమరుగవుతున్న పరిస్థితిలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ గతంలో సైతం బీసీలకు వంద సీట్లు ఇస్తానని నమ్మబలికి 30 నుంచి 40 మంది బీసీలకు మాత్రమే సీట్లు ఇచ్చి మోసం చేసిన చరిత్ర ఉందన్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌డ్డి దీక్ష చేస్తూ తెలంగాణ ఇస్తే రాయలసీమ ఇవ్వాలని ముడి పెట్టడం సరి కాదన్నారు. మీ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా కొరుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణకు ముడిపెట్టి ఉద్యమిస్తున్న బైరెడ్డి మీద చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంవూతికి లేఖ రాసినట్లు తెలంగాణ కోసం మరో లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక రోజు దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ సోమేశ్వర్‌రాజు,కో -కన్వీనర్ వీరభవూదయ్య, తెలంగాణ బీసీ ఉద్యోగ సంఘాల కన్వీనర్ బీంరాజు, తెలంగాణ ఓయూ జేఏసీ విద్యార్థి నేత రామారావుగౌడ్, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ నాయకులు హరీత్, బోర సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd