Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
రెండోరోజూ ఆగ్రహ జ్వాల

ఆదిలాబాద్ టౌన్, జూలై 12(టీ మీడియా) : హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఉన్నత న్యాయ విద్యపరిశోధన) 2011 బిల్లును వ్యతిరేకిస్తూ గు రువారం రెండోరోజు సైతం జిల్లావ్యాప్తంగా ఆం దోళనలు కొనసాగాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా, ఆంధ్రవూపదేశ్ పిలుపు మేరకు న్యాయావాదు లు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలను చేపట్టారు. ఆదిలాబాద్ బార్ అ సొసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కపిల్ సిబల్, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం కోర్టు ప్రాంగణం ఎదుట దహనం చేశారు. అంతకుముందు బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి, కేంద్రమంవూతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాలలో న్యాయవాదులు చుంచు సదానందం, వడ్నాల సత్యనారాయణ, ఆకుల రవీందర్, జి.సత్యనారాయణల ఆ ధ్వర్యంలో విధులను బహిష్కరించి కేంద్ర ప్రభు త్వ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్‌సిబల్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

న్యాయ పరిశోధన బి ల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్‌లలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రాజేశ్వర్‌రావ్ మాట్లాడుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి బార్ అసోసియేషన్‌ను నిర్వీర్యం చేసేందుకే ఈ బిల్లును ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులు వివిధ కోర్టుల్లో సమస్యల పరిష్కారానికి కృ షి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వెంట నే బిల్లును ఉపసంహరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ బార్‌అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముసుకు రమణాడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్రాల నగేష్, కోశాధికారి శర్మ, వై.సంజయ్‌డ్డి, సంతోష్ కుమార్, శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd