Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map


Home>>  Districts>>  Adilabad>>  General News
20 నుంచి ‘అసంఘటిత కార్మిక రణభేరి’

రాంనగర్, జూలై 11(టీ మీడియా): అసంఘటిత కార్మికుల స్థితిగతులను, విధి విధానాలను లోతుగా పరిశీలించిన అనంతరం ఈనెల 5 నుం చి వరకు హైదరాబాద్‌లో జరిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో అసంఘటిత కార్మిక సంక్షేమం కోసం ఈనెల 20 నుంచి 30 వరకు అసంఘటిత కార్మిక రణభేరి జాతను నిర్వహించాలని పిలుపునిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబా బు వెల్లడించారు. బుధవారం స్థానిక సుందర య్య భవనంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది అసంఘటిత రంగ కార్మికులున్నారని, వా రిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల కార్మికులకు యూనియన్లున్నాయని, లేనిచోట శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం ఈనెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 1140 మండలాలను కలుపుతూ 23 జిల్లాల్లో రణభేరి యాత్ర సాగుతుందని తెలిపారు. కార్మికులకు సంబంధిం చి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత, పీఎఫ్ ప్రమాద బీమా కల్పించాలన్నారు. ఆదిలాబాద్‌లో ఈనెల 2, 30 తేదీలలో ఎమ్మా ర్వో కార్యాలయం ముందు మహాధర్నాలు, 19, 20 తేదీల్లో మండల కార్మికుల సర్వేలు, యాత్ర ఎవరికోసం అనే దానిపై కరపవూతాల పంపిణీ, 21న రణభేరి యాత్రకు ఏర్పాట్లు, 22 నుంచి రణభేరి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇం దులో భాగంగా ఆయా మండలాల నుంచి కార్మికుల వద్దకు వెళ్లి సంతకాలు సేకరించి వారి స్థితిగతులను కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. ఆగస్టు లో సీఎంను కలిసి కార్మికుల స్థితిగతుల గురించి వివరించనున్నట్లు వెల్లడించారు.

సీఐటీయూ జిల్లా కార్యాలయం ప్రారంభం
సీఐటీయూ జిల్లా కార్యాలయాన్ని జిల్లా కేం ద్రంలోని బస్టాండ్ ఎదుట సాయిబాబా ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విధానాలు, ఉద్యో గులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇక్కడ ఆయన మాట్లాడు తూ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వక పోగా కాంట్రాక్టీకరణ, ప్రైవేటీ కరణను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బొగ్గు ఉత్పత్తులు అనేకంగా ఉన్న మనరాష్ట్రంలోనే కరెం టు కోత ఎక్కువగా ఉందని తెలిపారు. మనరాష్ట్రంలో కరెంటు తయారు చేసి, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటారని మండిపడ్డారు. అనంతరం ఆయనకు వీఆర్‌ఏ సంఘం తరుపున జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్షికమంలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముంజం శ్రీనివాస్, డి మల్లేశ్, బండిదత్తాత్రి, గణపతి, సంజీవ్, స్వామి, శకుంతల, నాజీమా, శ్రీనివాస్, సు దాం, నరేష్, లంకరాఘవులు, సతీష్, మామిడి వెంక న్న, అశోక్, కిరణ్, లింగాల చిన్నన్న, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd